రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం | - | Sakshi
Sakshi News home page

రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం

Mar 19 2025 2:09 AM | Updated on Mar 19 2025 2:10 AM

నరసరావుపేట: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రావిపాడు గ్రామ రైతులకు తగిన నష్టపరిహారం ఇస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో భూములు కోల్పోతున్న నరసరావుపేట మండలం రావిపాడు గ్రామస్తులకు నష్టపరిహార చెల్లింపులపై నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జేసీ హాజరై రైతులకు ఈ మేర హామీ ఇచ్చారు. ఆర్డీఓ కె.మధులత, జాతీయ రహదారి విస్తరణ అధికారులు, తహసీల్దార్‌ వేణుగోపాలరావు, మండల సర్వేయర్‌ మాట్లాడారు. రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement