గవర్నర్‌ను కలిసిన మహిళా పర్వతారోహణ బృందం | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన మహిళా పర్వతారోహణ బృందం

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

భువనేశ్వర్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లోని 6,111 మీటర్ల ఎత్తైన యునామ్‌ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన 11 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర మహిళా పర్వతారోహణ బృందం సోమ వారం గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటిని లోక్‌ భవన్‌లో కలిసింది. ఈ బృందం సాధించిన విజయానికి గవర్నర్‌ అభినందించారు. పర్వతారోహకులతో వారి యాత్ర, వారు ఎదుర్కొన్న సవాళ్లు మరియు అధిరోహణ సమయంలో వారి అనుభవాల గురించి సంభాషించారు. 11 మంది సభ్యులలో 5 మంది విజయవంతంగా గరిష్ట స్థాయికి చేరుకున్నారు. 6 మంది ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యలో తిరిగి రావాల్సి వచ్చింది. కంభంపాటి మాట్లాడుతూ ఈ ఘనత ఒడిశాకు గర్వకారణమని కొనియాడారు. పర్వతారోహణ, ఇతర సాహస క్రీడల్లో పాల్గొనేందుకు మరింత మంది మహిళలు స్ఫూర్తినిస్తారని అభినందించారు. జట్టు సభ్యుల సంకల్పం, ధైర్యం, స్ఫూర్తిని ప్రేరేపిస్తుందన్నారు. అసోసియేషన్‌ ఫర్‌ అడ్వెంచర్‌ అండ్‌ సోషల్‌ యాక్టివిటీస్‌ (ఏఏఎస్‌ఏ) ఉపాధ్యక్షుడు హరేష్‌ కుమార్‌ మిశ్రా మరియు అసోసియేషన్‌ కార్యదర్శి మరియు పర్వతారోహకుడు గణేష్‌ చంద్ర జెనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement