పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణలో భాగంగా సైకిల్ తొక్కడం ఎంతో అవసరమని, ప్రతి సోమవారం ‘మీకోసం’ గ్రీవెన్స్డే రోజున జిల్లా అధికారులు అందరూ సైకిళ్లపై రావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సైకిళ్లు తొక్కుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. సైకిళ్లు అందుబాటులో లేని వారు, సైకిల్ తొక్కడంలో ఇబ్బందులు ఉన్నవారు కనీసం ఈ–బైక్లనైనా వినియోగించాలని సూచించారు. – శ్రీకాకుళం పాతబస్టాండ్


