పెద్ద దిక్కుకు నిర్లక్ష్యపు జబ్బు | - | Sakshi
Sakshi News home page

పెద్ద దిక్కుకు నిర్లక్ష్యపు జబ్బు

Nov 21 2025 7:39 AM | Updated on Nov 21 2025 7:39 AM

పెద్ద

పెద్ద దిక్కుకు నిర్లక్ష్యపు జబ్బు

విజయవాడ జీజీహెచ్‌లో ఆధునిక వైద్య పరికరాల కొరత ● గ్యాస్ట్రో ఎంట్రాలజీలో కొలనోస్కోపీ లేక రోగుల ఇక్కట్లు ● గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాలని సూచిస్తున్న వైద్యులు ● న్యూరో ఎండోస్కోపీ, స్పైన్‌ ఎండోస్కోపీ లేక ఓపెన్‌ సర్జరీలు ● శుక్లాలకు ఫాకో మెషిన్‌ లేక ఓపెన్‌ సర్జరీలు చేస్తున్న వైద్యులు ● కొత్త, పాత ప్రభుత్వాస్పత్రిలో రోజుకు మేజర్‌, మైనర్‌ సర్జరీలు 80 నుంచి 100 వరకు జరుగు తాయి. శస్త్ర చికిత్సకు ముందుకు ఎనస్థీషియా ఇచ్చేందుకు వర్క్‌స్టేషన్స్‌ అవసరం. ఆధునిక వర్క్‌స్టేషన్‌లు కొనుగోలు చేయాలని వైద్యులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే వాటి కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశను దాటడం లేదు. దీంతో పాత వాటితోనే ఎనస్థీషియన్లు కుస్తీ పడుతున్నారు. ● పెద్ద పేగు సంబంధిత వ్యాధులతో నిత్యం పదుల సంఖ్యలో రోగులు ప్రభుత్వాస్పత్రికి వస్తారు. వారికి వ్యాధి నిర్ధారణ చేయాలంటే కొలనోస్కోపీ అవసరం. ఏడాదిన్నర కిందట కొలనోస్కోపీ మరమ్మతులకు గురైంది. దాని స్థానంలో కొత్తది కొనుగోలు చేయాల్సి ఉన్నా, ఇప్పటికీ సమకూరలేదు. దీంతో కొలనోస్కోపీ అవసరమైన రోగులను గుంటూరు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటులో చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ● కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఆధునిక కంటి శస్త్ర చికిత్సలు నిర్వహి స్తుండగా, జీజీహెచ్‌లో మాత్రం పాత పద్ధతిలోనే చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో శుక్లాల ఆపరేషన్ల కోసం ఫాకో మెషిన్‌ను కొనుగోలు చేశారు. చిన్న చిన్న పరికరాలు అందుబాటులో లేవనే సాకుతో దానిని పక్కన పడేశారు. ఇప్పుడు లేజర్‌ మెషిన్‌ అందుబాటులోకి వస్తే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని నేత్ర వైద్యులు ఉన్నతాధికారులు, పాలకులకు విన్నవిస్తున్నారు. ● ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. శ్వాసతీసుకోలేని వారిని వెంటిలేటర్‌పై ఉంచుతారు. ఆస్పత్రిలో ఉన్న కోవిడ్‌ నాటి వెంటిలేటర్లు సరిగా పనిచేయడం లేదు. ఆస్పత్రికి వచ్చిన పోస్టు గ్రాడ్యుయేషన్‌ నిధులతో కొనుగోలు చేయా లని నిర్ణయించినా, ఆ ప్రక్రియ సైతం టెండర్ల దశను దాటి ముందుకు సాగడం లేదు. ● న్యూరోసర్జరీలో కార్పొరేట్‌ స్థాయిలో ఆధునిక శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే జీజీహెచ్‌లో ఇప్పటికే ఓపెన్‌ బ్రెయిన్‌ సర్జరీలు చేస్తున్నారు. న్యూరో ఎండో స్కోపీ సమకూరిస్తే చిన్న హోల్‌తో శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు చెబుతున్నారు. స్పైన్‌ ఎండో స్కోపీ కూడా అవసరమని వైద్యులు పేర్కొంటున్నారు.

కనిపించని ప్రభుత్వ చొరవ

టెండర్లు పిలిచాం

విజయవాడ జీజీహెచ్‌లో ఆధునిక వైద్య పరికరాల కొరత

లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ పెద్ద దిక్కుగా నిలవాల్సిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్‌) సర్కారు నిర్లక్ష్యం కారణంగా కునారిల్లుతోంది. ఆధునిక వైద్య పరికరాలను సమకూరిస్తే మరింత నాణ్యమైన సేవలు అందిస్తామని పాల కులు, ఉన్నతాధికారులకు ఆస్పత్రి వైద్యులు విన్నవించినా స్పందన కనిపించడంలేదు. అరకొరగా ఉన్న మొండి పరికరాలతో కుస్తీ పడుతూ వైద్య సేవలు అందించడంతోపాటు శస్త్ర చికిత్సలు చేయాల్సి దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రిలో నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆధునిక పరికరాలు లేక పోవడంతో పూర్తిస్థాయిలో సేవలు అందించలేక పోతున్నారు. అవసరమైన పరికరాలు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రోగులను గుంటూరు ప్రభుత్వాస్ప త్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు.

కావాల్సిన పరికరాలు ఇవీ..

గుడివాడకు చెందిన 50 ఏళ్ల రోగి కిడ్నీల వాపుతో బాధపడుతూ 20 రోజుల కిందట ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. అతడిని క్యాజువాలిటీలో పరీక్షించిన వైద్యులు యూరాలజీ విభాగంలో ఆధునిక పరికరాలు లేకపోవడంతో గుంటూరు వెళ్లాలని సూచించారు. చేసేది లేక, అంబులెన్స్‌ మాట్లాడుకుని గుంటూరు తరలివెళ్లాడు.

విజయవాడ గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళ విరేచనంలో రక్తం పడుతుండటంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెకు పెద్దపేగు పరీక్ష చేసేందుకు కొలనోస్కోపీ అందుబాటులో లేక పోవడంతో గుంటూరు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆమె ఆ పరిస్థితిలో అంత దూరం వెళ్లలేక స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది. ఇలా నిత్యం అనేక మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వాస్పత్రిల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం చొరవ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులు ఏది కావాలన్నా స్పందించే వారే ఉండటం లేదు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల సమీక్షల్లో సమస్యలపై వైద్యులు ఏకరువు పెడుతున్నా స్పందన శూన్యం. దీంతో రోగులు ఆధునిక సేవలు అందడం లేదు. గత ప్రభుత్వ హయాంలో సమకూర్చిన పరికరాలతోనే వైద్యులు కుస్తీ పట్టాల్సి వస్తోంది. దీంతో రోగులకు ఒక్కోసారి ఇబ్బందులు తప్పడం లేదు.

వెంటిలేటర్లు, వర్క్‌స్టేషన్ల కొనుగోలుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. కొద్దిరోజుల్లోనే అందుబాటు లోకి రానున్నాయి. మరిన్ని పరికరాలు సమకూరనున్నాయి. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నాం.

– డాక్టర్‌ ఎ.వెంకటేశ్వరరావు,

సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌

పెద్ద దిక్కుకు నిర్లక్ష్యపు జబ్బు 1
1/1

పెద్ద దిక్కుకు నిర్లక్ష్యపు జబ్బు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement