
చెరువులో నీరంతా నల్లబడిపోయింది..
వేల లీటర్ల కెమికల్ వ్యర్థాలను మా చెరువులో వదులుతున్నారు. ఈ నెల 20వ తేదీన రాత్రి వ్యర్థాలను వదిలారు. చెరువు నీళ్లు నల్లబడిపోయి చెడు వాసన వస్తోంది. ఈ నీటిని పొలాలకు వాడాలంటే పైరు పాడైపోతుందేమోనని భయమేస్తోంది. ఈ నీటిలో పని చేయడం వల్ల మాకూ వ్యాధులు వచ్చేలా ఉన్నాయి.
– వి.లక్ష్మారెడ్డి, కురిటి చెరువు ఆయకట్టు రైతు, ఆత్కూరు గ్రామం
కెమికల్ వ్యర్థాలను చెరువులో పోయడం దారుణం. ఈ నీటినే వరి నాట్లు వేయడానికి వాడు తున్నాం. చెరువు నుంచి చెడు వాసన వస్తోంది. చెరువులో నీరు తాగడం వల్ల పశువులు చూడి నిలవడంలేదు. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టాలి.
– గంగుల రమేష్, కురిటి చెరువు ఆయకట్టు రైతు, ఆత్కూరు గ్రామం
●

చెరువులో నీరంతా నల్లబడిపోయింది..