
అనారోగ్యానికి పచ్చజెండా
నగరంలో విపరీతంగా పెరిగిన వ్యక్తిగత వాహనాలు ట్రాఫిక్లో ప్రయాణంతో అనారోగ్య సమస్యలు రక్తపోటు అధికమవుతుంది అంటున్న వైద్యులు యాంగ్జయిటీ, నిద్రలేమి సమస్యలు ఎక్కువే కాలుష్యంతో రక్తం చిక్కపడి స్ట్రోక్కు దారితీయొచ్చు
ట్రాఫిక్లో డ్రైవింగ్తో సమస్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ఒక అర్ధగంట బైక్పై ప్రధాన రోడ్లపై తిరిగితే చాలు అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. టన్నుల కొద్దీ కాలుష్యాన్ని వెదజల్లే కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. అనేక ప్రాణాంతక వ్యాధులకు సైతం కారణంగా నిలుస్తుంది. నిత్యం నగర రోడ్లపై ప్రయాణించే వారిలో శారీరక, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. రక్తం చిక్కపడి గుండెపోటు, మెదడు పోటుతో పాటు, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు. నిద్రలేమి సమస్యతో పాటు, అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు వెల్లడిస్తున్నారు.
ఇవే నిదర్శనం
ఇలా వీరిద్దరే కాదు. నగరంలోని ట్రాఫిక్తో అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
వైద్యులు గుర్తించిన సమస్యలివే...
ఏం చేయాలి...
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం ద్వారా కొందరు యాంగ్జయిటీకి గురవుతారు. యాంగ్జయిటీ ఉన్న వారు చికాకుతో రాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. నిద్రలేమి, హైపర్టెన్షన్ భారినపడుతున్న వారు ఉంటున్నారు. ముఖ్యంగా కాలుష్యం ప్రభావంతో రక్తం చిక్కపడి బ్రెయిన్స్ట్రోక్, హార్ట్స్ట్రోక్కు దారితీయొచ్చు. వెన్నెముక సమస్యలతో బాధ పడుతున్న వారు మా వద్దకు వస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును వినియోగించడం మేలు. వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి.
– డాక్టర్ డి.అనిల్కుమార్,
న్యూరాలజిస్ట్, విజయవాడ

అనారోగ్యానికి పచ్చజెండా