
ఎన్టీటీపీఎస్ వైద్యశాల ఉద్యోగులను కొనసాగిస్తాం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీ పీఎస్ వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను తొలగించబోమని, వారిని కొనసాగిస్తామని, ఎప్పటిలాగే నాణ్యమైన మందులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య పరీక్షలు అందిస్తామని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ శివ రామాంజనేయులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘అమ్మేసినట్లేనా?’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురిత మైంది. ఈ కథనానికి చీఫ్ ఇంజినీరు శివ రామాంజనేయులు పైవిధంగా స్పందించారు. నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించేందుకే ఈ విధానం పాటించామని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ప్రముఖ కంపెనీల మందులు అందజేయాలని, అందరు ఉద్యోగులను కొనసాగించాలని ప్రైవేట్ సంస్థకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆ ప్రకటనలో సీఈశివ రామాంజనేయులు తెలిపారు.