కోరుట్ల రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సర్పరాజ్పూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ సిమల్ల మధు డబ్బులు తీసుకొని మోసం చేశా డని బాధితులు ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబ మహిళలు శనివారం గల్ఫ్ ఏజెంట్ ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సుమారు రూ.5 కో ట్ల వరకు వసూలు చేసి గల్ఫ్ పంపిస్తానని మోసం చేసి తిరుగుతున్నాడని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఫ్లెక్సీ లను పట్టణంలోని పలుచోట్ల ఏర్పాటు చేశారు. కొ ద్దిసేపు ధర్నా చేసిన మహిళలు ఏజెంట్తో ఫోన్లో మాట్లాడి ఆందోళన విరమించి వెళ్లిపోయారు.


