నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి | - | Sakshi
Sakshi News home page

నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

సిరికొండ: నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని నిజామాబాద్‌ సీపీ సాయిచైతన్య అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం సీపీ వార్షిక తనిఖీలు నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసు ల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్‌లో అమలవుతు న్న 5ఎస్‌ విధానం తీరును సమీక్షించి, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్‌ అందించడంలో ప్రతి అ ధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తె లిపారు. సిరికొండకు సరిహద్దులో ఉన్నటువంటి జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారులపై నిఘా పటిష్టపరచాలని తెలిపారు. సిబ్బంది 24/7 స్థానికంగా అందుబాటులో ఉండాలని తెలిపారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో సీపీ మొక్క నాటారు. నిజామాబాద్‌ ఏసీపీ ప్రకాష్‌యాదవ్‌, ధర్పల్లి సీఐ భిక్షపతి, సీసీఆర్‌బీ సీఐ అంజయ్య, స్థానిక ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.

సీపీ సాయిచైతన్య

సిరికొండ పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement