
అనారోగ్యంతో మహిళ..
ఆర్మూర్టౌన్: ఆరోగ్య సమస్యలు భరించలేని ఓ మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆర్మూర్ మండలం చేపూర్లో చోటు చేసుకుంది. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. చేపూర్కు చెందిన ముత్యాల సుష్మ(47) అనే మహిళ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతోంది. ఇటీవల ఆస్పత్రిలో చూయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబీకులు హైదరాబాద్కు తరలించగా అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు.