తిరుగులేని వేముల | - | Sakshi
Sakshi News home page

తిరుగులేని వేముల

Apr 26 2025 1:31 AM | Updated on Apr 26 2025 1:31 AM

తిరుగ

తిరుగులేని వేముల

అభివృద్ధిలో

ఉమ్మడి జిల్లా ప్రగతిలో కీలక పాత్ర

కాళేశ్వరం 20, 21, 21ఏ ప్యాకేజీలు, ఆర్వోబీలు, న్యాక్‌ భవనాల నిర్మాణం..

పదేళ్లలో రూ.3 వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి

వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికై న ప్రశాంత్‌రెడ్డి

వేముల ఇరిగేషన్‌ విధానాలను మెచ్చి రాష్ట్రమంతటా అమలు చేసిన కేసీఆర్‌

మ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తండ్రి వేముల సురేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు సురేందర్‌రెడ్డి నిజాం షుగర్స్‌ చైర్మన్‌గా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. బీఆర్‌ఎస్‌ స్థాపించిన సమయంలో కేసీఆర్‌తో ఉన్న గుప్పెడు మందిలో సురేందర్‌రెడ్డి ఒకరు. ఆయన తుదిశ్వాస విడిచే వరకూ బీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో సురేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓటమి చెందగా ఆ సమయంలో ప్రశాంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేశారు. తర్వాత 2014, 2019, 2023 లలో వరుసగా బాల్కొండ నుంచి గెలుస్తూ వస్తున్నారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా సేవలందించారు.

తండ్రి ఆకాంక్షలను నెరవేరుస్తూ..

తండ్రి సురేందర్‌రెడ్డి ఆశయాల మేరకు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించే, ఆయకట్టు స్థిరీకరణ చేసే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 20, 21, 21ఏ ప్యాకేజీ పనులను మంజూరు చేయించి 70 శాతం పూర్తి చేయించారు. సారంగాపూర్‌, మెంట్రాజ్‌పల్లి, మంచిప్ప వద్ద పంప్‌హౌస్‌ పనులు, మెయిన్‌ పైప్‌లైన్‌ పనులు 70 శాతం పూర్తి చేయించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మింపజేశారు. రూ. 14 కోట్లతో నిజామాబాద్‌లో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) భవనాన్ని పూర్తి చేయించారు. మాధవనగర్‌, అర్సపల్లి వద్ద ఆర్‌వోబీ కలలను సాకారం చేశారు. మాధవనగర్‌–కంఠేశ్వర్‌ డబుల్‌ రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయించారు.

వరదకాలువకు తూములు

శ్రీరాంసాగర్‌ వరద కాలువకు జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో 16 చోట్ల తూములు ఏర్పాటు చేయించారు. బాల్కొండ నియోజకవర్గంలో 6 చోట్ల తూములున్నాయి. వీటి ద్వారా మొత్తం 45 చెరువులు నిండుతుండ గా, బాల్కొండ నియోజకవర్గంలో 18 చెరువులు నిండుతున్నాయి. వీటికి నిర్వహణ ఖర్చు అనేదే లేదు. రూ. 12 కోట్లతో లక్ష్మి కాలువ ఆధునికీకరణ, రూ. 6 కోట్లతో నవాబ్‌ ఎత్తిపోతల పథకం, రూ. 12 కోట్లతో నిజాంసాగర్‌ ఆధునికీకరణ ప నులు చేయించారు. నియోజకవర్గంలో 22 చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ చెక్‌డ్యాములకు తూములను ఏర్పాటు చేయించి పచ్చలనడ్కుడ చెరువును నింపారు. దీంతో సాగుకు సమృద్ధిగా నీరు లభిస్తోంది.

ఏది అడిగినా కేసీఆర్‌ కాదనలేదు..

గ్రామాల వారీగా సమస్యలు నోట్‌ చేసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్‌ మంజూరు చేయించుకున్నా. నేను ఏది అడిగినా కేసీఆర్‌ కాదనలేదు. చెక్‌డ్యాంలతో వేలాది బోర్లు రీచార్జి అయ్యాయి. కాళేశ్వరం 21వ ప్యాకేజీలో భాగంగా డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేయించాం. ప్రతి రెండున్నర ఎకరాలకు ఒక ఔట్‌లెట్‌ పాయింట్‌ వచ్చేలా చూశాం. ఈ నీరు వాగులోకి రావడంతో చెక్‌డ్యాంలు నిండుతున్నాయి. చెరువులూ జలకళ సంతరించుకుంటున్నాయి. – వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే

ఏది అడిగినా కేసీఆర్‌ కాదనలేదు..

నియోజకవర్గంలో గ్రామాల వారీగా సమస్యలు నోట్‌ చేసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్‌ మంజూరు చేయించుకున్నా. నేను ఏది అడిగినా కేసీఆర్‌ కాదనలేదు. చెక్‌డ్యాంల కారణంగా వేలాది బోర్లు రీచార్జి అయ్యాయి. కొత్త బోర్లు వేసే అవసరం లేకుండా పోయింది. కాళేశ్వరం 21వ ప్యాకేజీలో భాగంగా డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేయించాం. ప్రతి రెండున్నర ఎకరాలకు ఒక ఔట్‌లెట్‌ పాయింట్‌ వచ్చేలా చూశాం. ఈ నీరు వాగులోకి రావడంతో చెక్‌డ్యాంలు నిండుతున్నాయి. చెరువులూ జలకళ సంతరించుకుంటున్నాయి. – వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే

తిరుగులేని వేముల1
1/2

తిరుగులేని వేముల

తిరుగులేని వేముల2
2/2

తిరుగులేని వేముల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement