
జిల్లా జడ్జిగా భరతలక్ష్మి బాధ్యతల స్వీకరణ
ఖలీల్వాడి: నిజామా బాద్ జిల్లా జడ్జిగా భరతలక్ష్మి మంగళవా రం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని లేబర్ కోర్టులో ప్రెసిడెంట్ ఆఫీసర్గా పని చేసిన భరతలక్ష్మి బదిలీపై జిల్లా కోర్టుకు వచ్చారు. ఇక్కడ పని చేసిన జడ్జి సునీతా కుంచాల పెద్దపల్లికి బదిలీ అయ్యారు. న్యాయమూర్తి భరతలక్ష్మికి కోర్టు సిబ్బంది, న్యాయవాదులు స్వాగతం పలికారు.
కొనుగోలు కేంద్రం తనిఖీ
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని గాదేపల్లిలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. చిన్నయానం వద్ద ఎకో టూరిజం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వచ్చి న ఆయన కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి సన్నాలు, దొడ్డు రకం ధాన్యాన్ని, రికార్డులను పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులు, రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ వివరా లు తెలుసుకున్నారు. తేమశాతం యంత్రా లు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.
వడదెబ్బ నుంచి
రక్షించుకోవాలి
నిజామాబాద్నాగారం: వడ దెబ్బ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘వాతావరణంలో మార్పులు – ఆరోగ్యంపై ప్రభావం’ పోస్టర్లను కలెక్టర్ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆవిష్కరించారు. ఎండల తీవ్రత పె రుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. పనిచేసే చోట్ల కార్మికుల కోసం యజమాను లు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నారు. డీఎంహెచ్వో రాజశ్రీ, మున్సిపల్ కార్పొరేష న్ కమిషనర్ దిలీప్, పీవోఎన్సీడీ డాక్టర్ సా మ్రాట్ యాదవ్, నాగలక్ష్మి, ఘన్పూర్ వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు.

జిల్లా జడ్జిగా భరతలక్ష్మి బాధ్యతల స్వీకరణ