
రైతులు తలెత్తుకుని తిరిగే రోజు రావాలి
రాష్ట్రంలోని ప్రతి రైతు తలెత్తుకుని తిరిగే రోజు రావాలని, పంట పండించే రైతుకు బోనస్ ఇవ్వడంతో ప్ర భుత్వంపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని, పెట్టుబడి ఖర్చు తగ్గించాలని, అధిక దిగుబడులు పెరగాలన్నారు. రైతులు అప్పుల నుంచి బయట పడేలా అధికారులు, ప్రభుత్వం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పంటలకు బోనస్ ఇస్తే, రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.