
ఆదర్శం ‘జేఎంకేపీఎం’ ఎఫ్పీవో
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాలకు చెందిన 600 మంది రైతులు ఎఫ్పీవో ఏర్పాటు చేసుకున్నారు. తమ ఊరి పేరులోని మొదటి ఆంగ్ల అక్షరంతో ‘జేఎంకేపీఎం’ అనే పేరు పెట్టుకున్నారు. మనోహరాబాద్ వద్ద 14 గుంటల భూమిలో ప్రయోగశాల, యంత్రాలతో కూడిన 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో గోదాం నిర్మాణం చేసుకున్నారు. ఇందులో పసుపు ఉడకబెట్టే, పాలిష్ చేసే, గ్రేడింగ్ చేసే, పసుపు పౌడర్ తయారు చేసే, పసుపు ప్యాకింగ్ చేసే, పసుపు ఆకుతో ఆయిల్ తీసే యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటితోపాటు కలిగోట్, జక్రాన్పల్లి గ్రామాల్లో పసుపు ఆకుతో ఆయిల్ తీసే మరో రెండు యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. దేశవిదేశాల్లోని వివిధ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని అందుకు అనుగుణంగా ఉత్పత్తులు అందించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పసుపు ఆయిల్ విషయానికి వస్తే ఫార్మా కంపెనీలకు, ఫ్లోర్లు, టాయిలెట్లు శుభ్రం చేసే రెండురకాల ఉత్పత్తులు తయారు చేయనున్నారు. ఈ ఏడాది రూ.100 కోట్లు, వచ్చే ఐదేళ్లలో రూ.500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ ఎఫ్పీవో బాధ్యడు పాట్కూరి తిరుపతిరెడ్డి తెలిపారు. వీరు ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శకులు అధికసంఖ్యలో దర్శించారు.