భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం | - | Sakshi
Sakshi News home page

భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం

Apr 19 2025 9:48 AM | Updated on Apr 19 2025 9:48 AM

భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం

భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం

నిజామాబాద్‌ రూరల్‌: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు దక్కడం పట్ల రైల్వే స్టేషన్‌ రోడ్డు అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి(గీత భవనం) కార్యవర్గ సభ్యులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. గీత భవనం ప్రధాన కార్యదర్శి మేడిచర్ల ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ.. శతాబ్దాలుగా దేశ నాగరికత విషయంలో చైతన్యాన్ని పెంపొందించిన పవిత్ర గ్రంథాలకు సుదీర్ఘ కాలం తర్వాత గుర్తింపు రావడం గొప్ప విశేషమని కొనియాడారు. అధ్యక్షుడు ఎం ఎస్‌ నరసింహ చారి, కోశాధికారి ఆరెట్టి లక్ష్మీ నారాయణ, వెంకట స్వామి, చంద్ర శేఖర శర్మ, బొడ్డు దయానంద్‌, గంగాధర్‌, షేర్ల దయానంద్‌, జీఎం శంకర్‌, నరేందర్‌ రావు షిండే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement