మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు | - | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

Apr 19 2025 9:46 AM | Updated on Apr 19 2025 9:48 AM

మోపాల్‌/ఇందల్వాయి: మాజీ సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి ఇందల్వాయి మాజీ జెడ్పీటీసీ గడ్డం సుమనారెడ్డి, మాజీ కార్పొరేటర్‌ చామకూర విశాలినీరెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా తాజా రాజకీయ పరిస్థితులను కేసీఆర్‌కు వారు వివరించారు.

కొనుగోలు కేంద్రాలను

వెంటనే ప్రారంభించాలి

మోపాల్‌: మండలంలోని బాడ్సి సొసైటీ పరిధిలోగల బైరాపూర్‌లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని బీఆర్‌ఎస్‌ నాయకుడు ఇందల్‌ నాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌చేశారు. గ్రామంలో దాదాపు 70 శాతం నుంచి 80 శాతం వరకు వరి కోతలు పూర్తయ్యాయని, నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్నారు. కోతలు పూర్తయిన రైతులు వర్షాలు కురుస్తాయని ఆందోళనకు గురవుతున్నారని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే బైరాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, లేకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఇందల్‌ నాయక్‌ హెచ్చరించాడు.

పశువులకు టీకాలు

వేయించాలి

కమ్మర్‌పల్లి: పాడి రైతులు తమ పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని కమ్మర్‌పల్లి మండల పశు వైద్యాధికారి రాజశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం ఉప్లూర్‌లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించి 72 గోజాతి, 109 గేదె జాతి పశువులకు టీకాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడడం వల్ల నోటిలో పుల్లతో చొంగ కారడం, కాలి డెక్కలలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, అబార్షన్లు అవడం వంటి లక్షణాలు ఏర్పడతాయన్నారు.

ఇందల్వాయి ఎస్సైగా సందీప్‌ బాధ్యతల స్వీకరణ

ఇందల్వాయి: ఇందల్వాయి మండల ఎస్సై గా పని చేసిన బి.మనోజ్‌ బదిలీపై వెళ్లడంతో వీఆర్‌ నుంచి వచ్చిన జి.సందీప్‌ నూతన ఎస్సైగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు మండలంలో లా అండ్‌ ఆర్డర్‌ని పరిరక్షించేందుకు కృషి చేస్తానని ఎస్సై సందీప్‌ తెలిపారు.

ఎల్‌వోసీ అందజేత

ఇందల్వాయి: మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన లక్కాకుల శ్రీనివాస్‌ అనే వ్యక్తికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఐదు లక్షల రూపాయల ఎల్‌వోసీని ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి బాదిత కుటుంబానికి శుక్రవారం అందజేశారు. ఎల్‌వోసీ మంజూరు పట్ల వారు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నవీన్‌ గౌడ్‌, నాయకులు సుధాకర్‌, కర్సం మోహన్‌, ఆశిష్‌ తదితరులు ఉన్నారు.

వేద రక్షణకు ఉపనయనాలు

నిజామాబాద్‌ రూరల్‌: వేద పరిరక్షణకు పిల్లల్లో భక్తి వికాసం పెంపొందించడానికి సామూహిక ఉచిత ఉపనయనాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందూరు నగర బ్రాహ్మణ బంధువుల ఆధ్వర్యంలో సుభాష్‌ నగర్‌ శ్రీ రామాలయం ప్రాంగణంలో ఈ నెల 23న 21 మంది వటువులకు ఉపనయన సంస్కార మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంథని జయంత్‌ కుమార్‌, రొట్టె సురేష్‌ శర్మలు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన కర పత్రాలను శుక్రవారం రామాలయంలో ఆవిష్కరించారు. రామాలయం కమిటీ కార్యదర్శి శోభా నవీన్‌ రెడ్డి, చంద్ర శేఖర శర్మ, అనురాధ, వీణ తదితరులున్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు 
1
1/4

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు 
2
2/4

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు 
3
3/4

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు 
4
4/4

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement