
ప్రైవేటు గాలం
ఆశలకు
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెలివరీలు ఇలా..
శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లో u
ధర్పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన సుమలత (పేరు మార్చాం) అనే గర్భిణిని అదే గ్రామానికి చెందిన ఓ ఆశ కార్యకర్త జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి డెలివరీ కోసం తీసుకువచ్చారు. సదరు గర్భిణికి నెలలు నిండడంతోపాటు పిండం అడ్డం తిరిగిందని, సిజేరియన్ చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు సిజేరియన్కు ఒప్పుకొని, రూ.80 వేల వరకు అన్ని ఖర్చులతో ప్యాకేజీ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో నుంచి సదరు ‘ఆశ’కు 30 శాతానికి పైగా కమీషన్ను అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
● గైనిక్ ఆస్పత్రుల్లో
రిఫరల్ దందా
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గిన
సాధారణ ప్రసవాలు
● ప్రైవేట్లో పెరుగుతున్న సిజేరియన్లు
● ఆర్ఎంపీ, పీఎంపీల మాదిరిగానే ఆశ కార్యకర్తలకు కమీషన్లు
● చోద్యం చూస్తున్న వైద్యారోగ్యశాఖ
గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు డెలివరీకి తీసుకెళ్తే మీకేం వస్తుంది. అదే మా ఆస్పత్రికి పంపిస్తే డెలివరీ కోసం చెల్లించే ఫీజులో 30 నుంచి 40 శాతం వరకు కమీషన్ ఇస్తాం. ఎక్కువ మందిని పంపిస్తే ఇంకా ఎక్కువ కమీషన్ ఇస్తాం.
– ఓ ఆశ కార్యకర్తతో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుడి మాటలు
నిజామాబాద్నాగారం: జిల్లాలోని ప్రైవేటు గైనిక్ ఆస్పత్రుల్లో రిఫరల్ దందా జోరుగా సాగుతోంది. మొన్నటి వరకు ఈ దందాలో ఆర్ఎంపీ, పీఎంపీలే ప్రముఖ పాత్ర పోషించేవారు. తాజాగా ఈ మా ర్గంలోకి ఆశ కార్యకర్తలూ ప్రవేశించినట్లు తెలుస్తోంది. మహిళలు గర్భం దాల్చిన నుంచి డెలివరీ అయ్యే వరకు వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు ఏ చిన్న సమస్య ఎదురైనా ఆశ వర్కర్లను ఆశ్రయిస్తున్నారు. ఆశ వర్కర్ల సూచనలు తప్పక పాటిస్తున్నారు. డెలివరీ సమయంలోనూ వారి ద్వారానే ఆస్పత్రులకు వెళుతుంటారు. దీన్నే అదనుగా చేసుకొన్న ప్రైవేటు గైనిగ్ ఆస్పత్రులు.. ఆశవర్కర్లకు కమీషన్ ఆశ చూపుతున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న పలువురు ఆశ వర్కర్లు.. గర్భిణులను ప్రైవేటుకే తరలిస్తున్నారు.
ప్రైవేటులో ఫుల్.. సర్కారుకు నిల్
జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడీ, ద్వారకానగర్, పోచమ్మగల్లీ, ప్రగతినగర్, హైద్రాబాద్రోడ్, బోధన్రోడ్, తదితర ప్రాంతాల్లో కలిపి 70 పైగా ప్రైవేట్ గైనిక్ ఆస్పత్రులున్నాయి. బోధన్, ఆర్మూర్లో పదుల సంఖ్యలో గైనిక్ ఆస్పత్రులు ఉన్నాయి. ఏ ఆస్పత్రుల్లో చూసినా రిఫరల్ దందా జోరుగా కొనసాగుతోంది. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎలాగూ రిఫరల్ చేస్తూనే ఉన్నారు. వీరికి తోడు కొన్ని నెలలుగా ‘ఆశ’ కార్యకర్తలు సైతం రిఫరల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలీవరీల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేకంగా నిఘా పెట్టడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల సంఖ్య తగ్గి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలీవరీలు పెరిగాయి. కొన్ని నెలలుగా పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఆర్ఎంపీ, పీఎంపీల మాదిరిగానే ఆశలకు ప్రోత్సాహకాలు అందిస్తూ మఽభ్యపెడుతున్నారు. హోటళ్లలో బిర్యానీలు తినిపిస్తూ మాయమాటలు చెప్పి కమీషన్ల పేరిట ఆశ చూపుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫరల్స్ పెరిగాయి. ఏ ఆస్పత్రిలో చూసినా సిజేరియన్లు పోటాపోటీగా సాగుతున్నాయి. కాగా, సాధారణ డెలివరీ చేస్తే కేవలం రూ. 25 వేల లోపు ఫీజు ఉంటుంది. అదే సిజేరియన్లు చేస్తే కుటుంబసభ్యులను భయపెట్టి మరీ రూ. 60 వేల నుంచి రూ.80 వేల వరకు, అవసరమైతే రూ. లక్ష వరకు కూడా వసూలు చేస్తున్న ఆస్పత్రులు ఉన్నాయి.
న్యూస్రీల్
కొరవడిన నిఘా..
జిల్లాలోని ప్రైవేట్ గైనిక్ ఆస్పత్రులపై నిఘా కొరవడింది. గత కలెక్టర్, డీఎంహెచ్వోల సమన్వయంతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి పలుమార్లు సమీక్షించడంతో ప్రైవేటులో సిజేరియన్లు తగ్గాయి. ఏడాదిగా నిఘా తగ్గడంతో సిజేరియన్లు అమాంతం పెరిగాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
చర్యలు తప్పవు
ఆశ కార్యకర్తలు ప్రైవేట్ ఆస్పత్రులకు గర్భిణులను డెలివరీల కోసం రిఫర్ చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలున్నాయి. ఆశ కార్యకర్తలు డెలివరీల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకే తీసుకురావాలి. ఇప్పటి నుంచి మరింత నిఘా పెడతాం. – బీ రాజశ్రీ, డీఎంహెచ్వో

ప్రైవేటు గాలం

ప్రైవేటు గాలం

ప్రైవేటు గాలం

ప్రైవేటు గాలం

ప్రైవేటు గాలం

ప్రైవేటు గాలం