నిర్మల్టౌన్: బాధ్యతాయుత సేవలకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వారు పోలీస్ శాఖకు అందించిన సేవలు మరువలేనివి అని కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం పోలీస్ శాఖ నుంచి వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ సకా లంలో అందేలా చూస్తామని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున వారికి వారి కుటుం్చదిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


