
మలేరియా నివారణకు సహకరించాలి
● డీఎంహెచ్వో రాజేందర్
సారంగపూర్: మలేరియా నివారణకు వైద్యసిబ్బందితోపాటు ప్రజలంతా సహకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ కోరారు. ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా స్థానిక పీహెచ్సీ నుంచి ర్యాలీగా వెళ్లి ప్రజల కు మలేరియా వ్యాధి, నివారణ చర్యలపై అవగా హన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా సహా ఇతర కీటకజనిత వ్యాధుల నివారణకు ప్రజలు కూడా భాగస్వాములు కావాల ని పిలుపునిచ్చారు. మలేరియా అత్యంత ప్రమాదకరమైన జ్వరం అని తెలిపారు. అయితే దీనిని నివా రించడానికి ప్రజల అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు మురికి నీరు నిలువలేకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి రోజువారీ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి బారె రవీందర్, డాక్టర్ అబ్దుల్ జవాద్, సూపర్వైజర్లు ఉష, శ్రీనివాస్, ప్రేమ్సింగ్, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఎంఎల్హెచ్పీలు పాల్గొన్నారు.