
వెళ్లొద్దు టీచర్..
మామడ: ఆ ఉపాధ్యాయురాలు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచారు. మంచి బోధనతో విద్యార్థులు, గ్రామస్తులకు దగ్గరయ్యారు. గ్రామస్తులతో మాట్లాడి విద్యార్థుల సంఖ్యను 10నుంచి 35కు పెంచారు. ఆమె బోధన తీరుతో విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. చివరికి ఆమె బదిలీ కాగా, వారంతా తట్టుకోలేకపోయారు. వివరాలు.. మండలంలోని చెరువుముందుతండా ప్రాథమిక పాఠశాలలో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు సుప్రియ అంతర్ జిల్లా బదిలీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యా రు. బుధవారం విధుల నుంచి రిలీవ్ కాగా, పాఠశాలలో పోషకుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ కు బోధించిన టీచర్ బదిలీపై వెళ్తుండడాన్ని తట్టుకోలేని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే పాఠశాలలో ఉండి తమకు బోధించాలని వేడుకున్నారు. చివరికి వారికి ధైర్యం చెప్పి, బాగా చదువుకోవాలని సూచించిన ఉపాధ్యాయురాలు సుప్రియ అంతే బాధతో పాఠశాలను వీడారు.