
చెరువులే ఆదెరువు
సరదా.. కారాదు విషాదం
కొద్దిరోజుల్లో వేసవి సెలవులు రానున్నాయి. విద్యార్థులు చెరువులు, కుంటల వద్దకు ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి.
సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
8లోu
జిల్లాకేంద్రం చుట్టూ గొలుసుకట్టు చెరువులు
పక్కపక్కనే ఖజానా, జాఫర్ చెరువులు
నిర్మల్: చుట్టూ ఉన్న చాలా పట్టణాల్లో వేసవి వ చ్చిందంటే చాలు నీటి సమస్యలు మొదలవుతాయి. కానీ.. ఇప్పటికీ నిర్మల్కు ఆ పరిస్థితి రాలేదు. పట్ట ణం చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులే ఇందుకు కారణం. జిల్లాకేంద్రంలో కొన్ని కొత్త ఏరియాలు మినహాయిస్తే.. ఎక్కడికెళ్లినా 3–4మీటర్ల లోతులో నే భూగర్భజలాలున్నాయి. పలుగురాతి బండలు పర్చుకుని ఉన్నా.. పుష్కలంగా భూగర్భజలాలు ఉన్నాయంటే.. చుట్టూ రీచార్జ్ పాయింట్లలా ఉన్న చెరువులే కారణం. అలాంటి చెరువులను కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకూ నీటికష్టాలుండవు. కానీ.. ఇష్టారీతిన కబ్జాలు, నేరుగా డ్రైనేజీ పైపులైన్లు కలపడంతో చాలా చెరువులు పూర్వ వైభవం కోల్పోతున్నాయి. ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలో అక్రమార్కులు వాటినీ కనుమరుగు చేసినా.. చేయొచ్చు.
చాలా పట్టణాల్లో నీటికష్టం..
ఒక్క కామారెడ్డిలోనే కాదు.. రాష్ట్రంలోనే చాలా జిల్లాకేంద్రాలు, నగరాలు, పట్టణాల ప్రజలు ఎండాకాలం వస్తుందంటేనే ‘అమ్మో..’ అంటున్నారు. వందల మీటర్ల లోతు వేయించిన బోర్లూ ఎత్తిపోతున్నా యి. ఇక రెండుచేతుల్లో బకెట్లు పట్టుకుని, తలపై బిందె ఎత్తుకుని నీళ్లు మోయాల్సిందేనని జనం జంకుతున్నారు. లేదంటే, డబ్బులు పెట్టి ట్యాంకర్లను కొనుక్కోవాలి. మున్సిపల్ ట్యాంకర్ వచ్చేదాకా ఇంట్లో ప్రతీ నీటిబొట్టునూ పొదుపుగా వాడుకోవాల్సిన దుస్థితి. కొన్ని ఊళ్లల్లో నీటికష్టాల కారణంగా అక్కడికి ఆడపిల్లనివ్వడానికీ వెనుకంజ వేసిన సందర్భాలున్నాయి. నిర్మల్ పట్టణంలో మాత్రం ఇప్పటిదాకా ఆ స్థాయిలో నీటికష్టాలు రాలేదు.
ౖపైపెనే పాతాళగంగ
నిర్మల్లోని పాత అర్బన్ తహసీల్ కార్యాలయంలో భూగర్భజలశాఖ వారు ఫిజోమీటర్ ఏర్పాటు చేశా రు. దీని ద్వారా ప్రతినెలా భూగర్భజల నీటిమట్టా లు ఎలా ఉన్నాయో లెక్కలు తీస్తుంటారు. ఈ ఫిజో మీటర్ ప్రకారం జనవరిలో 3.26 మీటర్ల లోతులో నే భూగర్భజలాలన్నాయి. ఫిబ్రవరిలో 4.07 మీట ర్లకు తగ్గాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో ఒకట్రెండు మీటర్ల వరకు తగ్గుతాయన్న అంచనా ఉంది. అయినా.. ఏడెనిమిదిలోపే పాతాళగంగ ఉండటమనేది అరుదైన విషయమే. రాష్ట్రంలోని కొన్ని పట్టణాల్లో వందల మీటర్ల లోతుకు వెళ్లినా పాతాళగంగ పలకరించని పరిస్థితులున్నాయి.
రీచార్జ్ పాయింట్లుగా
మారి..
నిర్మల్లో ౖపైపెనే పాతాళ గంగ
‘గొలుసుకట్టు’తో నీటి నిల్వలు
కొన్ని ఏరియాల్లో ఎద్దడి షురూ
చెరువుల కబ్జానే అసలు సమస్య
భవిష్యత్ తరాలకు ఇబ్బందులే..
కామారెడ్డి జిల్లాకేంద్రానికి చెందిన ఈ చిత్రం.. అక్కడి నీటికష్టాలకు అద్దం పడుతోంది. వేసవి వస్తోందంటేనే అక్కడ నీటికటకట మొదలవుతుంది. వందల మీటర్ల లోతుకు వేసిన బోర్లూ అడుగంటాయి. ఇక ప్రతీ ఇంటి ముందూ ప్రజలు డ్రమ్ములు, బకెట్లు అన్నీ పెట్టుకుని నీటిట్యాంకర్ వచ్చేదాకా ఎదురుచూస్తుంటారు. ప్రతీ ఇంట్లో సంప్లు తప్పనిసరిగా ఉంటాయి. వాటిని నింపుకోవాలంటే రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
నీటి కష్టాలు తప్పవు
నిర్మల్లో ఇప్పటికీ నీటికష్టాలు లేవంటే గొలుసుకట్టు చెరువులే కారణం. అలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లేదంటే భవిష్యత్లో పట్టణంలో నీటికష్టాలు తప్పవు.– కూన శ్రీకాంత్, నిర్మల్
జిల్లాకేంద్రంలో బంగల్ చెరువు, ఖజానాచెరువు, సీతాసాగర్, జాఫర్ చెరువు, బతుకమ్మకుంట, ఇబ్రహీం చెరువు, వెంకటాపూర్ చెరువు, కంచెరోని చెరువు, సిద్ధాపూర్ చెరువు, చిన్నరాంసాగర్, మోతీచెరువు, ధర్మసాగర్, పల్లి చెరువు ఇలా.. చుట్టూ ఒకదానికొకటి గొలుసుకట్టుతో ఉన్నా యి. ఎప్పుడో 400 ఏళ్లక్రితం కాకతీయుల స్ఫూర్తితో నిర్మల్ పాలకులు వీటిని తవ్వించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పట్టణ ప్రజలకు నీటికుండల్లా అండగా ఉంటున్నాయి. నీటికష్టం లేకుండా చూస్తున్నాయి. భూగర్భజలాలకు రీచార్జ్ పాయింట్లుగా గొలుసుకట్టు చెరువులు ఉపయోగపడుతున్నాయి.
కాపాడుకోవాలి
జిల్లాకేంద్రంలో భూగర్భజలాలు తక్కువ లోతులోనే ఉన్నాయి. ఇక్కడి గొలుసుకట్టు చెరువులు భూగర్భజలాలకు రీచార్జ్ పాయింట్లుగా మారాయి. వీటిని కాపాడుకోకుంటే భవిష్యత్లో ఇబ్బందులు తప్పవు. – శ్రీనివాస్బాబు,
ఉపసంచాలకులు, భూగర్భజలశాఖ

చెరువులే ఆదెరువు

చెరువులే ఆదెరువు

చెరువులే ఆదెరువు

చెరువులే ఆదెరువు

చెరువులే ఆదెరువు