
ప్రేమ్సాగర్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
సోన్: మండల కేంద్రానికి చెందిన ఆష్టపు ప్రేమ్సాగర్ ఇటీవల దుబాయ్లో హత్యకుగురికాగా, బాధిత కుటుంబాన్ని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ప్రేమ్సాగర్ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ప్రేమ్సాగర్ మృతదేహం ఇంటికి తీసుకువచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రావుల రామ్నాథ్, బీజేపీ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, నాయకులు హరీశ్రెడ్డి, జక్క రాజేశ్వర్, ముత్కపల్లి నరేశ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రేమ్సాగర్ కుటుంబాన్ని ఆదుకుంటాం
దుబాయ్లో హత్యకు గురైన సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్సాగర్ కుటుంబాన్ని ఆదుకుంటామని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ మండల అధ్యక్షుడు మధుకర్రెడ్డి, ప్రసాద్, ప్రేమ్కుమార్, స్వామి బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశారు.