ఫలితాల కోసం దేశం మొత్తం వేచి ఉంది: అర్జున్ రామ్ మేఘ్వాల్ | Whole Country Waiting For Election Results | Sakshi
Sakshi News home page

ఫలితాల కోసం దేశం మొత్తం వేచి ఉంది: అర్జున్ రామ్ మేఘ్వాల్

Jun 4 2024 8:29 AM | Updated on Jun 4 2024 8:29 AM

Whole Country Waiting For Election Results

ఎన్నికల కౌంటింగ్ మొదలైపోయింది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి, బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి 'అర్జున్ రామ్ మేఘ్వాల్' కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత పార్లమెంటు చరిత్రలో జూన్ 4, 2024 ఎప్పటికీ చాలా ముఖ్యమైన రోజుగా గుర్తుంచుకోబడుతుంది. ఈ రోజు వచ్చే ఫలితాలు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం బలమైన పునాది వేస్తుంది. దేశం మొత్తం దీని కోసం వేచి ఉంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. ఇప్పటికే బికనీర్ ప్రజలు మమ్మల్ని మూడుసార్లు ఆశీర్వదించారు. నాలుగోసారి కూడా ఆశీర్వదించబోతున్నారని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement