
కోల్కతా: పశ్చిమబెంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ శుక్రవారం కోల్కతాలో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఇతర సమస్యలను ప్రస్తావించినట్టు అనంతరం మీడియాకు చెప్పారు.
రూ.1.18 లక్షల కోట్లు బకాయిలు రావాలంటూ మమత రెండు రోజుల పాటు ధర్నాకు దిగడం, అంతేగాక జాతీయ ఉపాధి హామీ కూలీలకు మమత సర్కారే చెల్లింపులు చేయడం తెలిసిందే.