సరికొత్త విధానంలో ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమం | Viral Video: Delhi Polices Latest Advisory On Road Safety | Sakshi
Sakshi News home page

Viral Video: సరికొత్త విధానంలో ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమం

Jul 16 2022 9:35 PM | Updated on Jul 16 2022 9:35 PM

Viral Video: Delhi Polices Latest Advisory On Road Safety - Sakshi

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఢిల్లీ పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయినా నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో పోలీసులు సరికొత్త విధానంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు ఒక  సోషల్‌ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే వేగంగా ఒక కారు రహదారిపై వెళ్లిపోతూ ఉంటుంది.

ఎవరతను  నన్ను చూసి ఆగడం లేదంటూ కరీన కపూర్‌ ఐకానిక్‌ క్యారెక్టర్‌ రెడ్‌లైట్‌పై కనిపిస్తోంది. ఇది బాలీవుడ్‌ సినిమా కభీ ఖుషీ కభీ ఘమ్‌లో కరీనా కపూర్‌ పూ క్యేరెక్టర్‌ అది. ఆ సినిమాలో అతడెవరూ నన్ను చూసి తిరగలేదు అనే ప్రసిద్ధ డైలాగ్‌ . ఈ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: చెస్‌ బోర్డు మాదిరి బ్రిడ్జ్‌... ఎక్కడుందో తెలుసా!)

Advertisement
 
Advertisement
Advertisement