అంకిత హత్యపై... ‘ఫాస్ట్‌ట్రాక్‌’ విచారణ | Uttarakhand Chief Minister Pushkar Singh Dhami on Ankita Bhandari case | Sakshi
Sakshi News home page

అంకిత హత్యపై... ‘ఫాస్ట్‌ట్రాక్‌’ విచారణ

Sep 26 2022 5:46 AM | Updated on Sep 26 2022 5:46 AM

 Uttarakhand Chief Minister Pushkar Singh Dhami on Ankita Bhandari case - Sakshi

డెహ్రాడూన్‌/రిషికేశ్‌: రిషికేశ్‌లోని రిసార్టు రిసెప్షనిస్ట్‌ అంకితా భండారి(19)హత్యపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపిస్తామని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదివారం ప్రకటించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు బయట పెడతామన్నారు. ఈ హామీ అనంతరం కుటుంబసభ్యులు అంకిత అంత్యక్రియలు పూర్తి చేశారు.

హత్యపై కీలక ఆధారాలు దొరికే అవకాశమున్న రిసార్ట్‌ను ప్రభుత్వం ఎందుకు కూల్చేసిందని అంకిత తండ్రి అంతకుముందు ప్రశ్నించారు. దోషులను శిక్షించాలంటూ రిషికేశ్‌–బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై 8 గంటలు ఆందోళనజరిగింది. మరోవైపు హత్యను పక్కదారి పట్టించేందుకు నిందితుడు, మాజీ మంత్రి వినోద్‌ దకొడుకు పులకిత్‌ ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. వినోద్‌ మాత్రం తన కొడుకు అమాయకుడంటూ వెనకేసుకుని వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement