కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం | Union Cabinet Meeting Started On Video Conference For First Time | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

Aug 19 2020 10:58 AM | Updated on Aug 19 2020 11:40 AM

Union Cabinet Meeting Started On Video Conference For First Time - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం10:30 గంటలకు ప్రారంభమైంది. మంత్రివర్గ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగటం ఇదే తొలిసారి. పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడడంతో మంత్రివర్గ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో చెరుకు మద్దతు ధర పెంపు, జైపూర్, గౌహతి, తిరువనంతపురం ఎయిర్‌పోర్టలకు సంబంధించి పీపీపీ విధానంలో లీజ్, సబార్డినేట్ ఉద్యోగాల నియామకానికి జాతీయ నియామక సంస్థ ఏర్పాటు, ఆ సంస్థ ద్వారా ఉద్యోగాలకు కనీస ఉమ్మడి ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ కోసం ‘మిషన్ కర్మయోగి’ ఏర్పాటు గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement