ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్
సాక్షి, చెన్నై: మహిళలపై జరిగే నేరాలను అడ్డుకునేందుకు తమిళనాడు ప్రత్యేకంగా సింగప్పెన్ అనే ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీఎం విజయ్ మంగళవారం ఈ యూనిట్ను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలపై నేరాల కట్టడికి డ్రోన్ పెట్రోలింగ్ విధానాన్ని తీసుకువస్తామన్నారు.
మహిళల భద్రతకు కొత్త విభాగం మరింత సహాయకారిగా ఉంటుందని సీఎం విజయ్ తెలిపారు. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా కాకీ ప్యాంటు, బ్లూ షర్ట్తో యూనిఫాంను రూపొందించారు. ఈ విభాగం లోగోను సీఎం విడుదల చేశారు. సింగప్పెన్ అంటే తమిళంలో ఆడసింహం వంటి ధైర్యశాలి అయిన మహిళ అని అర్థం. సింగప్పెన్ కోసం రూ.354 కోట్లు కేటాయిస్తామని, కొత్తగా 2,500 మందిని నియమిస్తామని ప్రకటించారు.


