
అధికారం కోసమో పదవి కోసమే నేను రాలేదని ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పీఎంవో సిబ్బందితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 140 కోట్ల మంది భారతీయులు నాకు పరమాత్మతో సమానం. ఇది మోదీ పీఎంవో కాదు.. ప్రజల పీఎంవో.. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతమీదే. అభివృద్ధికి మీరు వారధి లాంటి వారంటూ పీఎంవో సిబ్బందనిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.