930 భారతీయులు, వాటిల్లో రూ.20వేల కోట్ల అక్రమ నగదు! | Panama,paradise Papers Leaks Rs 20,353 Cr Of Undisclosed Credits Detected Says Central Govt | Sakshi
Sakshi News home page

930 భారతీయులు, వాటిల్లో రూ.20వేల కోట్ల అక్రమ నగదు!

Dec 8 2021 4:05 AM | Updated on Dec 8 2021 8:14 AM

Panama,paradise Papers Leaks Rs 20,353 Cr Of Undisclosed Credits Detected Says Central Govt - Sakshi

ప్రతికాత్మక చిత్రం

న్యూఢిల్లీ: పనామా, ప్యారడైజ్‌ పేపర్‌ లీకేజీ ఘటనల్లో దాదాపు 930 భారతీయులకు సంబంధించిన సంస్థల ఖాతాల్లో ఏకంగా రూ.20,353 కోట్లు జమయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా  ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి మంగళవారం రాజ్యసభలో ఈ విషయం చెప్పారు.

‘ఈ ఏడాది అక్టోబర్‌ ఒకటినాటికి ఆయా ఖాతాల్లోని మొత్తాలపై రూ.152.88 కోట్ల పన్నులను వసూలుచేశాం’ అని మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. చట్టాలను అతిక్రమించిన సంబంధిత వ్యక్తులపై ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. వీటిపై 52 కేసులు నమోదయ్యాయన్నారు. మరో 130 కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయన్నారు.

విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టిన కొందరు భారతీయుల పేర్లు బహిర్గతమైన విషయం తెల్సిందే. మల్టీ ఏజెన్సీ గ్రూప్‌(ఎంఏజీ) ఆధ్వర్యంలో కేసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement