కోమాలోకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ | No Changes In Pranab Mukherjee Health Condition Says Army Hospital | Sakshi
Sakshi News home page

ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు: ఆస్పత్రి

Aug 23 2020 11:52 AM | Updated on Aug 23 2020 12:00 PM

No Changes In Pranab Mukherjee Health Condition Says Army Hospital - Sakshi

ఆయన కోమాలోనే ఉన్నారని ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84) ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆస్పత్రి  తెలిపింది. ఆయన కోమాలోనే ఉన్నారని ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కాగా, ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్‌ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.
(చదవండి: కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై సీనియర్లు లేఖ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement