Navjot Sidhu: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ

Navjot Singh Sidhu Surrenders Patiala Court - Sakshi

ఛండీగఢ్‌: మాజీ క్రికెట‌ర్‌, పంజాబ్‌ కాంగ్రెస్ నేతన‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప‌టియాల జిల్లా కోర్టు ముందు లొంగిపోయారు. 1988లో న‌మోదైన ఓ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా త‌క్ష‌ణ‌మే కోర్టు ముందు లొంగిపోవాల‌ని కూడా సిద్ధూకు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సూచించింది. 

ఈ నేప‌థ్యంలో కోర్టు ముందు లొంగిపోవ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పిన సిద్ధూ... అనారోగ్య కార‌ణాల వ‌ల్ల తాను లొంగిపోయేందుకు కొంత స‌మ‌యం ఇవ్వాలంటూ శుక్ర‌వారం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన బెంచ్‌.. ఈ కేసులో ప్ర‌త్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ ను ఆశ్ర‌యించాల‌ని సూచించింది.

సుప్రీంకోర్టు నుంచి ఈ మాట వినిపించినంత‌నే శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఇంటి నుంచి బ‌య‌లుదేరిన సిద్ధూ..ప‌టియాల కోర్టు ముందు లొంగిపోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top