బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి | Madhya Pradesh Former High Court Judge Rohit Arya Joined In BJP, More Details Inside | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి

Jul 14 2024 2:55 PM | Updated on Jul 14 2024 3:01 PM

Madhya Pradesh Former High Court Judge Rohit Arya Joined In BJP

భోపాల్‌: దేశ రాజకీయాల్లో మరో  కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్‌ ఆర్య బీజేపీ పార్టీలో చేరారు. కాగా, రోహిత్‌ ఆర్య అనేక కేసుల్లో తీర్పులను వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

వివరాల ప్రకారం..  రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాగా, పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు. 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. జస్టిస్‌ రోహిత్ ఆర్య వెల్లడించిన కొన్ని తీర్పులు వివాదాస్పదం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. 2020లో మహిళ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తికి జస్టిస్‌ రోహిత్ ఆర్య బెయిల్‌ మంజూరు చేశారు. రక్షా బంధన్ రోజున బాధిత మహిళకు రాఖీ కట్టాలని, ఆమెకు రక్షణ కల్పించేలా నిందితుడు హామీ ఇవ్వాలని షరతు విధించారు. అయితే ఈ తీర్పు వివాదస్పదం కావడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది.

అలాగే,  2021లో ఇండోర్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్‌లకు బెయిల్ నిరాకరించారు. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఫరూఖీకి బెయిల్ మంజూరు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement