ఓటేస్తే మజూరీలో రాయితీ | Lok sabha elections 2024: Bumper offer in Chhattisgarh Voters | Sakshi
Sakshi News home page

ఓటేస్తే మజూరీలో రాయితీ

Apr 30 2024 4:38 AM | Updated on Apr 30 2024 4:38 AM

Lok sabha elections 2024: Bumper offer in Chhattisgarh Voters

ఛత్తీస్‌గఢ్‌లో బంపర్‌ ఆఫర్‌ 

రాయ్‌పూర్‌: ఓటేస్తే రెస్టారెంట్లు డిస్కౌంట్‌ ఇవ్వడాన్ని నోయిడాలో చూశాం. బెంగళూరులో అయితే ఏకంగా ఫ్రీ బీర్‌ ప్రకటించారు! ఈ జాబితాలో తాజాగా ఛత్తీస్‌గఢ్‌ చేరింది. అయితే ఇందులో కాస్త వెరైటీ ఉంది! ఓటేసి వేలికి నీలి రంగు సిరా చూపిస్తే బంగారం తయారీ ధరలను (మజూరీ) తగ్గిస్తామని రాష్ట్ర వాణిజ్య మండలి ప్రకటించింది. దాంతోపాటు పలు ఇతర ఉత్పత్తులపైనా రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ సంస్థల నిర్వాహకులు కూడా ఇందుకు అంగీకరించారు. 

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ అమర్‌ పర్వానీ నేతృత్వంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ గౌరవ్‌ కుమార్‌ సింగ్‌ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓటేసిన వారికి తమ ఉత్పత్తుల కొనుగోలుపై ఫర్నిచర్‌ అసోసియేషన్‌ 10 శాతం, టెక్స్‌టైల్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ 10 శాతం, రాయ్‌పూర్‌ ఆప్టికల్‌ అసోసియేషన్‌ 15 శాతం, ప్లైవుడ్‌ అసోసియేషన్‌ 5 శాతం, బులియన్‌ అసోసియేషన్‌ 15 శాతం రాయితీ ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలకు గాను ఏడింటికి మే 7న మూడో విడతలో పోలింగ్‌ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement