లోయలో పడిన బస్సు.. 16 మంది మృత్యువాత | At Least Seven Killed Several Injured In Jammu Kashmir Bus Accident, More Details Inside | Sakshi
Sakshi News home page

J&K Bus Incident: లోయలో పడిన బస్సు.. 16 మంది మృత్యువాత

May 30 2024 4:16 PM | Updated on May 30 2024 6:44 PM

At least seven killed Several injured in Jammu Kashmir bus accident

జమ్మూకశ్మీర్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 15 మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు.

వివరాలు.. జిల్లాలోని అఖ్నూర్‌ చుంగీ మోర్‌‌ ప్రాంతంలో ఈఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దాదాపు 150 అడుగుల లోయలోకి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతం నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లా శివ్ ఖోరీ ప్రాంతానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 25 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులు, స్థానికులతో కూడిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడిన వారిని జమ్మూలోని అఖ్నూర్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement