వావ్‌.. 4 వేల ఏళ్ల క్రితమే మల్టీ గ్రేయిన్‌ లడ్డూలు..

Laddoos Made With Cereals And Pulses Found During Harappan Site Excavation - Sakshi

న్యూఢిల్లీ : అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటైన హరప్పాలో నివసించిన ప్రజలు లడ్డూలు తినే వారన్న సంగతి తెలిసిందే. 2017లో జరిపిన తవ్వకాల్లో 7 లడ్డూలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గోధుమ రంగులో ఉన్న ఈ లడ్డూలు ఒకే సైజును కలిగి ఉన్నాయి. వాటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అవి క్రీస్తు పూర్వం 2500 సంవత్సరానికి చెందినవని తేల్చారు. ఈ లడ్డూలపై జరిపిన పరిశోధనలకు సంబంధించిన నివేదిక ఒకటి తాజాగా వెలువడింది. దీనిపై పురావస్తు శాస్త్రవ్తేత ఆగ్రిహోత్రి మాట్లాడుతూ.. వాటిపై భాగం బాగా గట్టిపడటంతో ఇంత కాలం పూర్తిగా పాడవకుండా ఉన్నాయని అన్నారు.  

వీటిపై నీళ్లు పడినపుడు వాటి రంగు మారుతోందని తెలిపారు. ఈ లడ్డూలు అన్నీ బార్లే, గోధుమ, బఠాణీలు మరికొన్ని తృణ, పప్పు ధాన్యాలతో తయారు చేశారని, ఈ విషయం మైక్రోస్కోపిక్‌ పరిశోధనల్లో తేలిందని వెల్లడించారు. వ్యవసాయ ఆధారితులైన హరప్పా ప్రజలు అత్యధిక మాంసపుకృతులు కలిగిన పదార్ధాలను ఆహారంగా తీసుకునేవారన్నారు. రెండు ఎద్దు బొమ్మలు, ఓ ఆయుధంతో పాటు ఈ లడ్డూలు దొరికాయని చెప్పారు. హరప్పా ప్రజలు వీటిని కొన్ని రకాల పూజల కోసం వాడేవారని పేర్కొన్నారు.

చదవండి, చదివించండి  : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం..

బైకర్‌ను ఆపిన పోలీస్‌.. చేతులెత్తి దండం పెడతారు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top