నేను నిర్దోషిని.. దోషిగా తేలితే ఊరి తీయండి..జి. కృష్ణయ్య హత్య కేసుపై ఆనంద్‌ వ్యాఖ్యలు

Hang Me If Found Guilty Former Bihar MP Anand Mohan Singh - Sakshi

పాట్నా: ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య హత్య కేసులో పద్నాలుగేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తాను దోషిగా తేలితే ఉరికి సైతం సిద్ధమేనంటూ వ్యాఖ్యానించాడాయన. 

బిహార్‌ అరారియాలో ఈ మాజీ ఎంపీ కమ్‌ గ్యాంగ్‌స్టర్‌ మాట్లాడుతూ.. కృష్ణయ్య హత్య కేసులో తాను నిర్దోషినంటూ ప్రకటించాడు. ఈ దేశం ఎవరి సొత్తూ కాదు. నేను చట్టాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్ముతాను. అందుకే 15 ఏళ్లకుపైగా శిక్ష అనుభవించా. ఒకవేళ నేను గనుక దోషి అని తేల్చితే.. ఉరిశిక్షకైనా సిద్దం అంటూ ప్రకటించాడు ఆనంద్‌ మోహన్‌ సింగ్‌.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top