Gaurav Uppal Will Review On Telangana People Stuck In Sudan - Sakshi
Sakshi News home page

సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష

Apr 26 2023 12:33 PM | Updated on Apr 26 2023 12:56 PM

Gaurav Uppal Review On Telangana People Stuck In Sudan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం 'ఆపరేషన్‌ కావేరి' పేరుతో సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్న భారతీయులను దశల వారిగా ఢిల్లీ, ముంబైలకు తరలించింది. ఇప్పటి వరకు సూమారు 160 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం.

ఈ మేరకు విదేశాంగ శాఖ సూడాన్‌ నుంచి వస్తున్న భారతీయుల విషయమై అన్ని రాష్ట్రాల రెసిడెంట్‌ కమిషనర్‌లను అప్రమత్తం చేసింది.ఈ నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్‌లో తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఈ అంశంపై అధికారులతో సమీక్ష జరిపారు. దీని కోసం ఢిల్లీ తెలంగాణ భవన్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోజు మొత్తం నలుగురు తెలంగాణ వాసులు వస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ వచ్చే వారికి ఇక్కడే వసతి, భోజనం ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపే ఏర్పాటు చేస్తున్నట్ల రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. అంతేగాదు ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వారిని ఏవిధంగా అయితే తెలంగాణకు పంపామో అదే తరహాలో పంపించేలా.. ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరవ్‌ ఉప్పల్‌ వెల్లడించారు.  

(చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్‌ నుంచి మరో 135 మంది తరలింపు)

Advertisement
 
Advertisement
Advertisement