రూ.50 కోట్ల కుక్క..ఈడీ సోదాల ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌! | ED probes Bengaluru breeder who bought Rs 50 crore wolfdog | Sakshi
Sakshi News home page

రూ.50 కోట్ల కుక్క.. ఈడీ సోదాల ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌!

Apr 18 2025 8:21 AM | Updated on Apr 18 2025 12:30 PM

ED probes Bengaluru breeder who bought Rs 50 crore wolfdog

బనశంకరి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదుచేసే కుక్క­ను రూ.50 కోట్లకు కొనుగోలు చేశానని ప్రకటించిన బెంగళూరుకు చెందిన ఎస్‌.సతీశ్‌ ఇంటికి ఈడీ అధికారులు సోదాకొచ్చి షాకిచ్చారు. తోడే­లు– కాకేసియన్ షెపర్డ్ జాతి కుక్క సంకరంతో పుట్టిన ఊల్ఫ్‌ డాగ్‌ అనే శునకాన్ని తాను భారీ ధర పెట్టి కొన్నానని, ప్రపంచంలో ఇలాంటి కుక్క ఇదొక్కటేనని కొన్నిరోజు­లు­గా ప్రచారం చేస్తున్నా­రు.

సోసల్‌ మీడియాలో ప్రచారంతో ఈడీ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఈడీ అధికా­రు­లు సతీశ్‌ ఇంటికి వచ్చి సోదాలు చేశారు. ఫెమా చట్టం ఉల్లంఘన కింద దర్యాప్తు చేశారు. దర్యాప్తులో రూ.50 కోట్ల డబ్బు ఎక్కడిది, విదేశాలకు డబ్బు లావాదే­వీ­లు ఎలా జరిగాయి అనేది ప్రశ్నలు కురిపించారు. కుక్క కొనుగోలుకు సంబంధిత ఆధారాల్ని ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఈడీ అధికారుల ప్రశ్నలకు కంగుతిన్న ఎస్‌.సతీష్‌.. సోషల్‌ మీడియాలో తాను చూపించిన కుక్కకు అంత సీను లేదని, రూ.50 కోట్లకు కొనలేదని, ప్రచా­రం కోసం జిమ్మిక్కులు చేస్తున్నా­డని తెలిసి నివ్వెరపోయారు.

సోదాలపై ఈడీ పీటీఐ అధికారుల్ని సంపద్రించింది. ఈడీ అధికారులు సైతం ఇదే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. సోషల్‌ మీడియాలో ఫేమ్‌ కోసమే యజమాని సతీష్ రూ.50 కోట్ల కుక్క అంటూ ప్రచారం చేసుకున్నాడని, ఆ కుక్కను భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయలేదని తాము గుర్తించినట్లు చెప్పారు. అంతేకాదు రూ.50 కోట్లు అంటూ కుక్కపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఆ కుక్క ఖరీదు రూ.లక్షలోపే ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement