2025లోనే పంచముఖి ఆలయ అర్చకుడు శ్యామాచారి జోస్యం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్లో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఖచ్చితంగా బాధ్యతలు చేపడతారని ఆనాడే జోçస్యం చెప్పామని గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం అర్చకుడు శ్యామాచారి హర్షం పంచుకున్నారు. గతంలో ఆలయాన్ని సందర్శించిన నేతల్లో నలుగురు ముఖ్యమంత్రి పదవులను అలంకరించారన్నారు. మంగళవారం రాయచూరు తాలూకా పంచముఖి గాణదాళ ఆంజనేయ ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది అక్టోబర్లో రాయచూరు జిల్లా పర్యటనలో భాగంగా గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామికి శివకుమార్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు.


