మహిళపై అత్యాచారం.. బీజేపీ నేతపై కేసు నమోదు చేయాలని కోర్టు సీరియస్‌

Delhi HC Orders FIR Against BJP Leader Shahnawaz Hussain - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో బీజేపీ నేత షానవాజ్‌ హుస్సేన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్‌ 2018లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఢిల్లీకి చెందిన ఓ మహిళ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ నేత తనపై అత్యాచారం చేశాడని, చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 

దీంతో, బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ కేసులో విచారణలో భాగంగా గురువారం ఢిల్లీ హైకోర్టు.. షానవాజ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, 3 నెలల్లో పోలీసులు విచారణ పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని వాస్తవాలను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

ఇది కూడా చదవండి: కరోనా అలర్ట్‌.. భారీగా పెరిగిన పాజిటివ్‌ కేసులు, మరణాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top