-
మేడారం అటవీ ప్రాంతంలో దారుణం..
వరంగల్: పని కోసం రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను కారులో ఎక్కించుకుని ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామానికి చెందిన మరో మహిళతో పని నిమిత్తం ఏప్రిల్ నెల 20వ తేదీ ఉదయం ఆరెపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై వెళ్తుండగా.. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన ఎస్.రవి అనేవ్యక్తి ఎ.రమేశ్ అనే వ్యక్తితో కలసి కారులో (తెల్లరంగు బ్రెజా) వచ్చి మహిళలిద్దర్నీ ఎక్కించుకుని ములుగు వైపు బయల్దేరారు. ఓ మహిళ మార్గమధ్యంలోనే దిగిపోగా, కొంతదూరం వెళ్లాక ములుగు జిల్లాకు చెందిన డి.నాగరాజు, హన్మకొండకు చెందిన బి.లక్ష్మణ్, వర్ధన్నపేటకు చెందిన బి.సుధాకర్ అనే యువకులు కారులో ఎక్కారు. ఈ ఐదుగురు కలసి కారులో ఉన్న మహిళను బెదిరిస్తూ మేడారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ముగ్గురు యువకులు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు యువకులు సహకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ మహిళను బెదిరించి ములుగు తీసుకొచ్చి అక్కడ బస్సు ఎక్కించి వెళ్లిపోయారు. సదరు బాధితురాలు ములుగురోడ్డు వద్ద బస్సుదిగి తన భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడికి వెళ్లావని నిలదీయడంతో ఆమె భయపడి కరీంనగర్ జిల్లాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. గత నెల 29న ఫిర్యాదు చేసిన భర్త.. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 25న ఏనుమాముల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పుట్టింటి దగ్గర ఉన్నట్లు భార్య చెప్పడంతో అక్కడకు వెళ్లిన భర్తకు సామూహిక అత్యాచారం సంగతి తెలిసింది. దీంతో బాధితురాలు, ఆమె భర్త ఏప్రిల్ 29న కలసి ఫిర్యాదు చేయగా పోలీసులు ఐదుగురు యువకులతోపాటు సామూహిక అత్యాచారానికి సహకరించిన మరో మహిళపై కూడా గ్యాంగ్రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరో మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. ఇది కూడా చదవండి: నేను నిర్దోషిని.. దేవ్, సీతలు పిలిచారనే వెళ్లా.. థాయ్ పేకాట వ్యవహారంపై చికోటి స్పందన -
HCU: విదేశీ విద్యార్థినిపై లైంగికదాడియత్నం.. ప్రొఫెసర్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్పై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా పోలీసులు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏసీపీ రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాము. హిందీ నేర్పిస్తానని థాయ్లాండ్ విద్యార్థిని ఇంటికి పిలిచి ప్రొఫెసర్ రవిరంజన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాఫ్ట్ డ్రింక్లో లిక్కర్ కలిపి అత్యాచారం చేయబోయాడు. విద్యార్థిని ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. మరోవైపు.. విద్యార్థినిపై అత్యాచార ఘటన నేపథ్యంలో హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇక, దారుణ ఘటన నేపథ్యంలో సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రవిరంజన్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
అలర్ట్: సరుకుల డెలివరీ కోసం వచ్చి.. మహిళతో అసభ్యకర ప్రవర్తన..
ఇటీవలే కొరియాకు చెందిన ఓ యూట్యూబర్తో కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే మహారాష్ట్రలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరుకులు డెలివరీ చేసేందుకు ఓ కస్టమర్ట్ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్.. మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటన ఖర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఖర్ పశ్చిమ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సబీనా ఆమె కుటుంబంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సరుకుల డెలివరీ కోసం ఆన్లైన్ డెలివరీ సంస్థను ఆశ్రయించింది. దీంతో, ఆన్లైన్ సంస్థకు చెందిన షాజాదే షేక్ సరుకులను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని డెలివరీ బాయ్ గమనించాడు. ఈ క్రమంలోనే సరుకుల డెలివరీ తర్వాత.. వీడియో తీయాలని చెప్పి ఫోన్లో వీడియో మోడ్ ఆన్చేశాడు. అనంతరం.. ఆమె చేయి పట్టుకుని అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. Another #Mumbai molestation horror as a delivery boy molests a girl who had ordered groceries via #Zepto App. The delivery boy entered the house forcefully.@AtkareSrushti reports | @ZeptoNow @zeptocares pic.twitter.com/vvNYbRD1rV — Mirror Now (@MirrorNow) December 2, 2022 దీంతో, ఒక్కసారిగా షాకైన బాధితురాలు.. వెంటనే కిచెన్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ సాయంతో సెక్యూర్టీకి కాల్ చేసింది. వెంటనే స్పందించిన అక్కడికి వచ్చిన సెక్యూర్టీగార్డ్ అతడిని అడ్డుకున్నాడు. అనంతరం, అతడిలో చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని బాధితురాలు వీడియోను డిలీట్ చేసింది. ఇక, తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపింది. ఈ క్రమంలో సదరు డెలివరి సంస్థపై బాధితురాలు సీరియస్ కామెంట్స్ చేసింది. ఇలాంటి వారితో రోజు ఇంకెంత మంది మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారో అని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత, సదరు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. @CPMumbaiPolice @bombaytimes @timesofindia @MumbaiPolice @ZeptoNow #harssment #WomenSafety #womenharssment #justice #mumbai #zepto #harssment pic.twitter.com/gJop6NAk6T — Sabeena (@sabeenasyed8) December 1, 2022 ఇక, ఘటనపై సదరు డెలివరీ సంస్థ స్పందించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మేము ఇలాంటి విషయాలను సీరియస్గా తీసుకుంటాము. స్థానిక చట్టాన్ని అమలు చేసే సంస్థలతో ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. విచారణలో మేము కూడా పాల్గొంటున్నాము. ఇలాంటి ప్రవర్తనను త్రీవంగా ఖండిస్తున్నాము. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. Hi Sabeena, We take such matters with utmost seriousness. We are partaking in a thorough investigation of the incident with the local law enforcement bodies. We condemn such behavior. Stringent action will be taken on perpetrators based on facts. — Zepto Cares (@zeptocares) December 1, 2022 -
పట్టపగలే యూపీలో దారుణం.. షాకింగ్ వీడియో
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో రోజురోజుకూ మహిళలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. రెండు క్రితమే యూపీలో కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి పట్ల కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై మీరట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 19వ తేదీన కొందరు వ్యక్తులు పట్టపగలే ఓ యువతిని దారుణంగా కొట్టారు. ఇద్దరు వ్యక్తులు.. ఆమె కాళ్లు, చేతులను పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అనంతరం, వారు ఆమెపై దాడి చేశారు. ఈ క్రమంలోనే బాధితురాలు సహాయం కోసం వేడుకుంది. తనను వదిలేయాలని గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. ఈ ఘటన సందర్భంగా చుట్టుపక్కలు చాలా మంది ఉన్నప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. ఆమెపై దాడిని కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. తాజాగా ఈ వీడియో పోలీసులకు చేరింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలికి బరేలీలోని ఆసుప్రతిలో వైద్య చికిత్సలు అందిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే యూపీలోని బదోస్ రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలికి తెలిసిన వ్యక్తి ఆమెను.. తన భర్త పిలుస్తున్నాడని చెప్పి ఆమెను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారంతా తనకు తెలిసిన వారే కావడంతో మాట్లాడింది. అనంతరం, నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆ తరువాత వరుసగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. దీంతో, కొన్ని రోజులు మౌనంగా బాధను దిగమింగిన మహిళ.. చివరకు ధైర్యం చేసి భర్తకు జరిగిన విషయం చెప్పింది. అనంతరం, వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో 2022 జనవరి నుండి ఆగస్టు వరకు మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 56,083 కేసులను నమోదు చేసింది, ప్రతి లక్ష జనాభాకు 50.5 నేరాల రేటుగా నమోదైంది. మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు 31,000 ఫిర్యాదులు గత ఏడాది జాతీయ మహిళా కమిషన్ (NCW)కి అందాయి. యూపీలో 2020తో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల ఫిర్యాదులు 30 శాతం పెరిగాయి. -
విజయవాడలో దారుణం.. స్నేహితుల పనేనా..?
‘‘విజయవాడ పటమటలో నివసించే ఓ వివాహిత ఫొటోలను ఓ ఆగంతకుడు అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఆమె వాట్సాప్కే పోస్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పలు దఫాలుగా రూ.25 వేలు వసూలు చేశాడు. ఆ తరువాత ఆమె వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న ఆ కీచకుడు అవే ఫొటోలను ఆమె భర్తతో పాటు మరికొందరికి పోస్ట్ చేశాడు. బాధిత మహిళ భర్త సహకారంతో ఇటీవల సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం ఆమెతో పాటు కాలేజీలో చదువుకున్న ఇద్దరు వ్యక్తులు ఈ సైబర్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన మహిళ సోషల్ మీడియా మాయగాళ్ల వేధింపులతో కొన్ని నెలలు మానసిక వేదన అనుభవించింది. ఆ వేధింపులను తాళలేక ఈ గండం నుంచి కాపాడాలంటూ ఓ స్నేహితుడిని సాయం కోరింది. అయినా ఫలితం లేకపోవడంతో చేసేది ఏమీలేక ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో ఆ మహిళ సాయం కోరిన వ్యక్తే ఈ నేరానికి పాల్పడ్డాడని వెల్లడైంది. దీంతో ఆమె అవాక్కయింది. స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు ఆ కీచకుడు’’. విజయవాడ : ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో సైబర్ నేరాల పరంపర కొనసాగుతోంది. విద్యార్థునులు, యువ తులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని కొందరు కీచకులు వేధింపులకు పాల్పడుతున్నారు. బాధితులకు తెలిసిన వ్యక్తులే ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. యువతులు, మహిళలతో చనువుగా ఉంటూ వారి ఫొటోలను సేకరించి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు పోగొట్టుకుని, కొన్నాళ్లు మానసిక వేదన అనుభవించాక బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో తమతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులే ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుసుకుని కంగుతింటున్నారు. గడిచిన 15 నెలల్లో ఒక్క విజయవాడలో 210 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్వయంకృపరాధమే.. గృహిణులు, యువతులు, విద్యారి్థనులు అధిక సమయం స్మార్ట్ ఫోన్తోనే గడిపేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే వీడియోలు, షార్ట్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ తరహాలో తాము సైతం గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో వ్యక్తిగత ఫొటోలు, భర్త, పిల్లలతో సరదాగా తీసుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పరిచయాలను పెంచుకునే ప్రయత్నంలో తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్లను కూడా ఆమోదిస్తున్నారు. అదును కోసం మాటు వేసిన సైబర్ నేరగాళ్లు వారితో పరిచయం పెంచుకుని మరిన్ని వీడియోలు, ఫొటోలను సేకరించి, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఎడిటింగ్ యాప్ల సాయంతో అసభ్యకరంగా మారి్ఫంగ్ చేసి వేధింపులకు దిగుతున్నారు. ఇటీవల పెనమలూరు మండలం పోరంకి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఇదే తరహాలో మోసపోయింది. తనతో పాటే చదువుకుంటున్న యువకుడు తన వీడియోను మారి్ఫంగ్ చేశాడని తెలియక సింగ్నగర్కు చెందిన మరో విద్యారి్థని మూడు నెలల పాటు మానసిక వేదన అనుభవించింది. మారి్ఫంగ్ వీడియోలు, ఫొటోల విషయం ఇంట్లో చెబితే ఏమంటారోనే భయంతో కీచకులు అడిగిన డబ్బు ఇవ్వడం, వారు చెప్పినట్లు చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. గతంతో నగరాలకే పరిమితమైన ఈ నేరాలు ప్రస్తుతం పల్లెలకూ పాకాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా నేరాల్లో బాధితులు అధికంగా విద్యావంతులే ఉంటున్నా, 25 శాతం మంది బాధితులే పోలీసులను ఆశ్రయిస్తున్నారని సమాచారం. పరువు పోతుందని కొందరు, సైబర్ నేరాలపై అవగాహన లేక మరి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. అప్రమత్తంగా ఉండాలి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రా మ్లో ఎంతో మంది మోసగాళ్లు ఉంటారు. కొందరు మహిళలు పరిచయాలు పెంచుకునే క్రమంలో ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. సైబర్ నేరాల కట్టడికి కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ‘చేరువ’ వాహనం ద్వారా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ ప్రొఫైల్కు లాక్ చేస్తే మంచిది. మన నుంచి వెళ్లిన ఫొటోలను మాత్రమే మోసగాళ్లు మారి్ఫంగ్ చేసి వేధిస్తారు. మన నుంచి మన ఫొటోలు వెళ్లకపోతే వారు ఏమీ చేయలేరు. – టి.కె.రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement