చిత్తూరు పోలీసుల వినూత్న ఆలోచన | Complaint Boxes Arranged In Chittor District | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఫిర్యాదు బాక్స్‌లు.. వేధింపులపై ఉక్కుపాదం

Jun 18 2019 4:58 PM | Updated on Jun 18 2019 8:56 PM

Complaint Boxes Arranged In Chittor District - Sakshi

సాక్షి, తిరుపతి(చిత్తూరు) : రాష్ట్రంలో మహిళలపై వేధింపులు అధికమవుతున్న నేపథ్యంలో.. చిత్తూరు జిల్లాలో పోలీసులు నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సలహాపై జిల్లా మొత్తం ఫిర్యాదు బాక్స్‌లను అమర్చారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్‌ ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులకు మధ్య మెరుగైన సంబంధాలు ఏర్పడాలనే ఉద్దేశంతో జిల్లా పరిధిలో మొత్తం 95 ఫిర్యాదు బాక్స్‌లను ఏర్పాటు చేశామని, జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ  బాక్స్‌లను  ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

రద్దీ ప్రదేశాలైన పాఠశాలలు, బస్టాండ్స్‌, మార్కెట్‌, ఆలయాలు వంటి ప్రాంతాలతోపాటు, ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో 5  ఫిర్యాదు బాక్స్‌లను అమర్చారని పేర్కొన్నారు. వీటి పర్యవేక్షణ పూర్తిగా స్పెషల్‌ బ్రాంచ్‌ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఫిర్యాదు బాక్స్‌లను తెరిచి ఫిర్యాదులను ఎస్పీ గారికి తెలియజేస్తామని, అంతేకాక  వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement