పామును నాగుపాము మింగిన ఘటన మైసూరులోని బోగాడిలోని భారతీ ఎన్క్లేవ్లో జరిగింది. ఒక నాగుపాము పామును వెంబడించింది. నాగుపాము బారి నుండి విడిపించుకోవడానికి పోరాడి విఫలమైంది. చివరికి నాగుపాము దానిని మింగేసింది. ఈ దృశ్యాన్ని స్థానికుడి మొబైల్ ఫోన్లో రికార్డ్ అవ్వగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాముల నిపుణుడు శ్యామ్ మాట్లాడుతూ ఆహారం దొరకనప్పుడు పాము మరో పామును మింగడం సాధారణమేనని అన్నారు.
మైసూరు(కర్ణాటక)


