Delhi Unlock 2021 News In Telugu: మే 31 నుంచి దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత - Sakshi
Sakshi News home page

మే 31 నుంచి దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత

May 28 2021 4:45 PM | Updated on May 28 2021 5:35 PM

Cm Arvind kejriwaL Delhi Unlock Process Begin May 31 Factories - Sakshi

కరోనా కేసుల పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గడంతో మే 31 నుంచి దశల వారీగా లాక్‌డౌన్‌ నియంత్రణలను సడలిస్తామని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో మే 31 నుంచి దశల వారీగా లాక్‌డౌన్‌ నియంత్రణలను సడలిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్‌ క్రేజీవాల్‌ వెల్లడించారు. ఢిల్లీలో వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడంతో మే 31 నుంచి దశల వారీగా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఎల్.జీ అనిల్ బైజల్‌ను కలిసిన తర్వాత మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మే 31 నుంచి వ్యాపారాలకు సడలింపులు ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి ఒక వారం పాటు నగరంలో పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా బారినపడకుండా కాపాడటంతో పాటు వారు ఆకలితో చనిపోయే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూ వాటి మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిపుణులు, ప్రజల అభిప్రాయం ఆధారంగా ప్రభుత్వం ప్రతి వారం అన్‌లాక్ ప్రక్రియను కొనసాగిస్తుందని అన్నారు.

చదవండి: రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన అరవింద్‌ కేజ్రీవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement