సామ్రాజ్య భారతి 1877/1947

Azadi Ka Amrit Mahotsav:Samrajya Bharati 1877 To 1947 - Sakshi

ఘట్టాలు
1. గుజరాత్‌లో కచ్‌ మ్యూజియం స్థాపన.
2. క్వీన్‌ విక్టోరియా భారతదేశ సామ్రాజ్ఞి అయిన సందర్భంగా దర్బార్‌లలో వేడుకలు.
3. గిల్గిట్‌ ఏజెన్సీ ఆరంభం. జమ్మూకశ్మీర్‌ సంస్థాన భూభాగాలను ఎవరూ ఆక్రమించకుండా ఈ రక్షణ ఏజెన్సీని బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

చట్టాలు
లిమిటేషన్‌ యాక్ట్, ఈస్ట్‌ ఇండియా లోన్‌ యాక్ట్, కోడ్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొసీజర్‌

జననాలు
మూడవ ఆగాఖాన్‌ : ఆలిండియా ముస్లిం లీగ్‌ తొలి శాశ్వత అధ్యక్షులు (కరాచీ); సర్‌ అల్లమ మహమ్మద్‌ ఇక్బాల్‌ : కవి, ప్రత్యేక పాకిస్థాన్‌ భావనకు ఆద్యులు (సియాల్కోట్‌); కవాస్జీ జెంషెడ్జీ పెటిగర : ముంబై తొలి డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలిస్‌; రవిశంకర్‌ శుక్లా : భారత స్వాతంత్య్రోద్యమ కార్యకర్త (మధ్యప్రదేశ్‌); పులిన్‌ బెహారీదాస్‌ : విప్లవ వీరుడు, ‘ఢాకా అనుశీలన్‌ సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు (బంగ్లాదేశ్‌); వీరభద్రరాజు బహదూర్‌ : కురుపాం జమీందారు (విజయనగరం జిల్లా); ఈఫరేసియా ఎళువతింగళ్‌ : ఇండియన్‌ నన్‌ (కొచ్చిన్‌); నిరలాంబ స్వామి : జాతీయవాది, తత్వవేత్త, స్వాతంత్య్రోద్యమ కార్యకర్త (పశ్చిమబెంగాల్‌); తరుణ్‌ రామ్‌ ఫూకన్‌ : రాజకీయ వేత్త, ‘దేశభక్త’గా ప్రసిద్ధి (అస్సాం).

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top