దేశానికి బాబా మోదీ అవసరం లేదు: ఒవైసీ | AIMIM Chief Asaduddin Owaisi Speaks On Ayodhya Ram Mandir In Lok Sabha, Details Inside - Sakshi
Sakshi News home page

దేశానికి బాబా మోదీ అవసరం లేదు: ఒవైసీ

Feb 11 2024 7:57 AM | Updated on Feb 11 2024 11:50 AM

AIMIM Chief Asaduddin Owaisi Speaks On Ram Mandir In Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం వైఖరిపై మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం ఒక వర్గానికో, మతానికో చెందిన ప్రభుత్వమా లేక యావద్దేశానికి ప్రభుత్వమా అని నిలదీశారు. దేశానికి బాబా మోదీ ప్రభుత్వం అవసరం లేదన్నారు. రామమందిర నిర్మాణంపై శనివారం సభలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘రామ మందిర ప్రారంభం ద్వారా ఒక మతంపై మరో మతం విజయం సాధించినట్లు సందేశం ఇవ్వదలిచారా? దేశంలోని 17 కోట్ల ముస్లింలకు ఏం సందేశమిస్తున్నారు? నేను బాబర్, జిన్నా, ఔరంగజేబ్‌ తరఫున మాట్లాడటం లేదు. రాముడిని గౌరవిస్తా. కానీ గాడ్సేను ద్వేషిస్తా. ‘బాబ్రీ మసీదు జిందాబాద్, బాబ్రీ మసీదు ఎప్పటికీ ఉంటుంది’ అంటూ ముగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement