పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ఎస్ఈ స్వయంగా మక్తల్కు వచ్చి పరిస్థితిని పరిశీలించడం, వెంటనే నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడంపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. కానీ 132 కేవీ విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుందని ట్రాన్స్కో అధికారులకు తెలిసినప్పటికీ రైతులు, వినియోగదారులకు సమాచారం అందించడంలో విఫలమయ్యారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. కనీసం గ్రామాల వారీగా సరఫరా నిలిచే సమయం, పునరుద్ధరణ వివరాలను తెలియజేసి ఉంటే రైతులు కొన్ని పనులు వాయిదా వేసుకునేవారని, పొలాలకు కూలీలను తీసుకొచ్చేవారు కాదని అభిప్రాయపడుతున్నారు.


