ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఎకరా రూ. 20 వేలు కౌలు చెల్లించి ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని రబీలో మొక్కజొన్న సాగు చేశాను. బోరు ఆధారంగా పైరుకు సాగునీటిని మళ్లించాల్సి ఉంది. ఈ సీజన్లో వర్షాలు లేని కారణంగా పైరు చేతికందాలంటే దాదాపు పది నీటి తడులు అందించాలి. రసాయన ఎరువులు, పురుగు మందులు, సాగునీటి తడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలకు పైగా ఖర్చువుతుంది. ఈ ఏడాది మొక్కజొన్నలో మంచి దిగుబడులు వస్తాయని భావిస్తున్నాను.
– కొత్తూరు, రైతు, వెలగటూరు, కోవెలకుంట్ల మండలం


