జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: దేశ వ్యాప్తంగా ఎన్ఐటీ, ఐఐటీల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్–2026 మొదటి విడత పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం పరీక్ష సమయానికి గంటముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతించా రు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించా రు. జేఈఈ మెయి న్స్ పరీక్షలు ఈ నెల 29వ తేది వరకు జరుగనున్నాయి. పరీక్షలకు కె.వి సుబ్బా రెడ్డి కాలేజీలోని ఆయాన్ డిజిటల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ పరీక్షకు 254 మంది విద్యార్థులు హాజరయ్యారు.


